70 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స.. 24 మంది పరిస్థితి విషమం
అగ్నిప్రమాదానికి కారణాలపై దర్యాప్తు.. భద్రతా నిబంధనలు పాటించారా అన్న కోణంలో విచారణ
Bangok: థాయ్లాండ్ రాజధాని Bangkok లోని Rong Beer Na Ladprao మ్యూజిక్ బార్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 30కు చేరినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు.
ఈ ఘటనలో గాయపడిన వారిలో 70 మందికి పైగా ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 24 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు బ్యాంకాక్ నగర అధికారులు తెలిపారు.
ఆదివారం అర్ధరాత్రి సమయంలో థాయ్ రాజధాని ఉత్తర ప్రాంతంలో ఉన్న Rong Beer Na Ladprao బార్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బందికి సుమారు అరగంట సమయం పట్టింది. గత 17 ఏళ్లలో Bangkok లో జరిగిన అత్యంత ఘోర అగ్నిప్రమాదంగా ఈ ఘటన నిలిచింది.
ఈ బార్లో ఒకేసారి దాదాపు 600 మంది కస్టమర్లు ఉండే అవకాశం ఉందని నిర్వహణ తెలిపింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎంత మంది ఉన్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏమిటి? బార్ భద్రతా నిబంధనలు పాటించిందా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన పలువురు కిటికీలు లేని బాత్రూమ్లలో చిక్కుకుపోయారని, అక్కడే ఎక్కువ మంది మృతదేహాలు లభించినట్లు పోలీసులు వెల్లడించారు.



