పలుమాసాలుగా బాలికను మోసం చేసినట్లు పోలీసుల ఆరోపణ
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hyderabad: హైదరాబాద్లోని కేపీహెచ్బీ ప్రాంతంలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన ఆరోపణలతో ఉత్తరప్రదేశ్కు చెందిన 28 ఏళ్ల Fruit Vendor ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కేపీహెచ్బీ పోలీసుల వివరాల ప్రకారం, రేహాన్ అనే వ్యక్తి బాధితురాలి ఇంటి ముందు పండ్లు అమ్మేవాడు. ఏడో తరగతి చదువుతున్న బాలికను పలుమాసాలుగా చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయని చెప్పి ఇంట్లోకి పిలిచి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని రేహాన్ బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో భయాందోళనకు గురైన బాలిక ఈ ఘటనను చాలా కాలం పాటు కుటుంబ సభ్యులకు చెప్పలేదని తెలిపారు.
ఇటీవల రేహాన్ మరోసారి బాలికను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. వెంటనే వారు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితుడు రేహాన్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.



