ఒమన్ తీరంలో జరిగిన దాడి తర్వాత గల్లంతైన ఇంజినీర్ మృతిచెందినట్లు కుటుంబం ధృవీకరణ
మృతదేహాన్ని స్వదేశానికి గౌరవంగా తీసుకురావాలని కేంద్రానికి కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
పూణే: ఒమన్ తీరానికి సమీపంలోని హోర్ముజ్ జలసంధిలో GFS Galaxy అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడి తర్వాత గల్లంతైన పూణేకు చెందిన మెరైన్ ఇంజినీర్ Heramb Karmarkar మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ధృవీకరించారు.
ఆదివారం ఒమన్ తీరానికి సమీపంలో భారతీయులు ప్రయాణిస్తున్న GFS Galaxy నౌకపై దాడి జరిగింది.
ఈ ఘటన తర్వాత నౌకలో ఉన్న 10 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. మరో వ్యక్తి గల్లంతైనట్లు అప్పట్లో వెల్లడించింది.
Heramb Karmarkar మృతి చెందిన విషయాన్ని ఆయన మామ వివేక్ టాండన్ ధృవీకరించారు.
మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి:
ఈ సందర్భంగా వివేక్ టాండన్ మాట్లాడుతూ..,
“అతను కేవలం 30 ఏళ్ల యువకుడు. మా కుటుంబం తరఫున భారత ప్రభుత్వానికి ఒక్కటే విజ్ఞప్తి.అతని మృతదేహాన్ని దెబ్బతినకుండా మా కుటుంబానికి అప్పగించి స్వదేశానికి తీసుకురావాలి” అని చెప్పారు.
ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని విదేశాంగ శాఖ పేర్కొంది.
ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిరంతరం గమనిస్తోందని MEA తెలిపింది.
భారత రాయబార కార్యాలయం X వేదికగా స్పందిస్తూ, GFS Galaxy ఘటనపై నిరంతరం నిఘా ఉంచినట్లు తెలిపింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) తెలిపిన వివరాల ప్రకారం..,
సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ నౌక GFS Galaxy హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న సమయంలో ఇరాన్కు చెందిన Islamic Revolutionary Guard Corps (IRGC) దాడి చేసింది.
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


