పేపర్ లీక్ నిందితులకు కఠిన హెచ్చరిక : ప్రధాని మోదీ

July 23, 2026 10:52 AM
PM Modi announces Fast Track Courts for exam paper leak cases.

పరీక్షల పేపర్ లీక్ కేసుల్లో వేగంగా విచారణ.. కఠిన శిక్షలు తప్పవని స్పష్టం
విద్యార్థుల భవిష్యత్తు రక్షణే ప్రభుత్వ ప్రాధాన్యం.. అన్ని చర్యలకు అధికారులకు ఆదేశాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్ కేసుల్లో నిందితులకు వేగంగా, కఠిన శిక్షలు విధించేందుకు Fast-Track Courts లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.

సోషల్ మీడియా వేదిక Xలో ప్రధాని మోదీ స్పందిస్తూ, “యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. పేపర్ లీక్‌లకు పాల్పడిన వారికి వేగంగా, కఠిన శిక్షలు పడేలా Fast-Track Courts ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, విభాగాలకు ఆదేశాలు ఇచ్చాను” అని తెలిపారు.

విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇది కీలక నిర్ణయమని ప్రధాని పేర్కొన్నారు.

యువత భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు. “దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తే మా అత్యున్నత ప్రాధాన్యం” అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలతో చర్చలకు సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి J.P. Nadda బుధవారం తెలిపారు. ఆందోళన చేస్తున్న CJP ప్రతినిధులతో ప్రభుత్వం సానుకూల వాతావరణంలో సమావేశమై వారి అభిప్రాయాలను విన్నట్లు చెప్పారు.

వారు తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించామని, వారు అందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని నడ్డా వెల్లడించారు. అవసరమైనప్పుడు చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

పరీక్షల పేపర్ లీక్‌లపై దీర్ఘకాలిక విధానాన్ని రూపొందించేందుకు పార్లమెంట్ అత్యంత అనుకూల వేదిక అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమస్యపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media