12 గంటల్లోనే బాలికను సురక్షితంగా గుర్తించిన ప్రత్యేక బృందాలు
మానవ అక్రమ రవాణా ముఠాకు విక్రయించాలనే కుట్ర బయటపడింది
ఆదిలాబాద్ : మైనర్ బాలిక కిడ్నాప్ కేసును Adilabad police వేగంగా ఛేదించారు. బాలికను సురక్షితంగా గుర్తించి, కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు మహిళలను బుధవారం అరెస్ట్ చేశారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, నైతం గంగుబాయి, గుమ్మడివార్ భారతిలను రుయ్యాడి గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
విచారణలో బాలికను మానవ అక్రమ రవాణా ముఠాకు విక్రయించాలని ముందే ప్రణాళిక రూపొందించినట్లు నిందితులు అంగీకరించినట్లు వెల్లడించారు.
సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని మహిళ బాలికను తీసుకెళ్లినట్లు సమాచారం అందడంతో Adilabad police వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి సమయంలో Adilabad పట్టణంలోని మహాలక్ష్మీవాడ ప్రాంతంలో బాలికను గుర్తించి సురక్షితంగా రక్షించారు.
ఈ కేసును కేవలం 12 గంటల్లోనే ఛేదించి తమ కుమార్తెను క్షేమంగా అప్పగించిన పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఆత్రం జంగు, కప్లీ బాయి కృతజ్ఞతలు తెలిపారు.



