కోడిపందేలపై పోలీసుల దాడి
రూ.24,040 నగదు, 18 బైక్లు సీజ్
మంచిర్యాల: Mancherial ,కల్లెంపల్లి గ్రామ శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్న 16 మందిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది.
కల్లెంపల్లి శివారులో కోడిపందేల నిర్వహణ:
అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ బృందాలు అర్ధరాత్రి సమయంలో కల్లెంపల్లి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంపై దాడి చేశాయి. అక్కడ కోడిపందేలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు నిందితుల నుంచి 4 కోళ్లు, 45 కత్తులు, 12 మొబైల్ ఫోన్లు, 18 మోటార్బైక్లు, రూ.24,040 నగదును స్వాధీనం చేసుకున్నారు.
16 మంది అరెస్ట్:
టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన వారిలో కుడిమెత సాయి, జన్నె కమలాకర్, బండారికంటి కోటేష్, తేలిగె సాయి, చౌదరి తిరుపతి, ఆత్రం సందీప్, మొగిలి మల్లేష్, మంచాల హనుమంతు, ఎనుముల మధుకర్, మానేపల్లి రాజన్న, మానేపల్లి విలాస్, కీర్తి లక్ష్మణ్, కార్పేట తిరుపతి, దండేర మహేష్, సత్పతి రాజశేఖర్, దొమల మల్లేష్ ఉన్నారు.
వీరంతా వేమనపల్లి, దహెగాం మండలాల్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారని ఏసీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని తదుపరి చర్యల కోసం వేమనపల్లి పోలీసులకు అప్పగించారు.
అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు:
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలు, వాటిని నిర్వహించే వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
బుధవారం రాత్రి వేమనపల్లి మండలం కల్లెంపల్లి గ్రామంలో Mancherial టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులు, కోళ్లు, మొబైల్ ఫోన్లు, మోటార్బైక్లను మీడియా ముందు ప్రదర్శించారు.



