అమెరికాలో నిఖిత హత్య
అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖిత గొడిశాల (27) హత్య కేసులో కీలక పురోగతి లభించింది.
కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ శర్మను తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అరెస్ట్ చేశారు.
నిందితుడిని అమెరికాకు అప్పగించే ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.
నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన నిఖిత
హైదరాబాద్లోని లాలాగూడ, విజయపురి కాలనీకి చెందిన నిఖిత నాలుగేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు.
ఈ ఏడాది జనవరి 2న ఆమె మాజీ రూమ్మేట్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మ.. నిఖిత కనిపించడం లేదంటూ అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆ తర్వాత అతను భారత్కు తిరిగి వచ్చాడు.
అర్జున్ అపార్ట్మెంట్లో మృతదేహం
అర్జున్ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే, జనవరి 3న అతని అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. మృతదేహం అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గతేడాది డిసెంబర్ 31వ తేదీనే ఆమె హత్యకు గురై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
అప్పు విషయంలోనే హత్య చేశాడని ఆరోపణ
నిఖిత తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తన కుమార్తె వద్ద అర్జున్ అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని అడిగినందుకే ఆమెను హత్య చేశాడని ఆనంద్ ఆరోపించారు.
ఆగ్రాలో నిందితుడి అరెస్ట్
సాంకేతిక ఆధారాల సాయంతో తెలంగాణ పోలీసులు అర్జున్ ఆచూకీని ఆగ్రాలో గుర్తించారు.
అక్కడ అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు.
అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు అర్జున్ను అమెరికాకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.



