సదాశివపేటలో బైక్‌కు నిప్పు.. గుర్తుతెలియని వ్యక్తులపై అనుమానం

September 1, 2026 3:44 PM
Burnt bike after fire incident in Sadasivapet colony

గురునగర్ కాలనీలో ఘటన.. పూర్తిగా దగ్ధమైన ద్విచక్ర వాహనం
ఇటీవల మూడు చోరీలు.. పోలీసుల పెట్రోలింగ్ పెంచాలని స్థానికుల విజ్ఞప్తి

సంగారెడ్డి: Sadasivapet పట్టణంలోని గురునగర్ కాలనీలో పార్క్ చేసిన బైక్‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

రిటైర్డ్ ఉద్యోగి కోట శ్రీశైలం తన ఇంటి వద్ద ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేశారు. మంగళవారం ఉదయం బైక్ మంటల్లో కాలిపోతుండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి బయటకు వచ్చారు. అయితే మంటలను ఆర్పేలోపే బైక్ పూర్తిగా దగ్ధమైంది.

వరుస ఘటనలతో కాలనీలో ఆందోళన

ఈ ఘటనతో Sadasivapet,గురునగర్ కాలనీలో కలకలం రేగింది. ఇటీవల ఇదే కాలనీలో మూడు చోరీలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు. వరుస ఘటనల నేపథ్యంలో కాలనీలో భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోలింగ్ పెంచాలని విజ్ఞప్తి

కాలనీలో వరుసగా ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పెట్రోలింగ్‌ను పెంచాలని స్థానికులు కోరారు. బైక్‌కు నిప్పంటించిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media