ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపు కొనసాగింపు
జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది.
బుద్గాం జిల్లాలోని అష్దర్ గాలి ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.
ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
‘ఆపరేషన్ అష్దర్’ పేరుతో జమ్మూ కాశ్మీర్లో తాజా ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపింది.
ఇంటెలిజెన్స్ సమాచారంతో సోదాలు
బుద్గాం జిల్లాలోని అష్దర్ గాలి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది.
దీంతో ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కలిసి శుక్రవారం అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించారు.
‘ఆపరేషన్ అష్దర్’లో భాగంగా తనిఖీలు, భద్రతా చర్యలు చేపట్టారు.
గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు.
ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం
ఉగ్రవాదుల కాల్పులకు భారత భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
అతడి వద్ద నుంచి ఏకే రైఫిల్, కొన్ని ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని సైన్యం తెలిపింది.
ఈ ఆపరేషన్కు సంబంధించిన పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.



