కుత్బుల్లాపూర్ పరిధిలోని దుండిగల్ ప్రాంతంలో శనివారం ఉదయం హత్య జరిగింది. కౌడిపల్లికి చెందిన స్వాతి అనే మహిళను రాజేష్ అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం అతడు స్వయంగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
పోలీసుల ప్రకారం, స్వాతి గత కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటూ రాజేష్తో సన్నిహితంగా ఉండేది. ఈ ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగి, కోపంతో రాజేష్ కత్తితో గొంతుకోసి చంపినట్లు సమాచారం.
దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని **పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

