ATTACK on YCP :తాడిపత్రిలో వైసీపీ నేత ఓబుల్ రెడ్డిపై దాడి

November 11, 2025 5:27 PM

తాడిపత్రిలో వైసీపీ నేత, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఆర్‌.సీ. ఓబుల్ రెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో జరిగిన ఈ దాడిలో గాయపడిన ఓబుల్ రెడ్డిని స్థానికులు మొదట తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసుపత్రికి చేరుకుని వైద్యులను కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడి వెనుక రాజకీయ కక్షలు ఉన్నాయా లేక వ్యక్తిగత కారణాలా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media