AP CM :ఏపీలో భారీ పెట్టుబడి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాబు గారిదే

November 13, 2025 12:03 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా పెట్టుబడి రానుంది. ప్రముఖ ఎనర్జీ సంస్థ రెన్యూ పవర్‌ రాష్ట్రంలో రూ. 82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఐదేళ్ల తర్వాత ఈ సంస్థ మళ్లీ ఏపీలో అడుగు పెడుతోంది.

ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌లో సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, 6MW ఉత్పత్తి సామర్థ్యం, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం, గ్రీన్ హైడ్రోజన్ తయారీ యూనిట్‌లు ఉండనున్నాయి.

ఈ పెట్టుబడులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు సృష్టించడమే కాకుండా దీర్ఘకాలిక పన్ను ఆదాయం అందిస్తాయని మంత్రి తెలిపారు. గూగుల్ పెట్టుబడికంటే ఇది పది రెట్లు మెరుగైన పెట్టుబడిగా ఆయన వ్యాఖ్యానించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media