pawan kalyan : బద్రి సినిమా చేస్తున్నపుడే మేము ఆ ల్యాండ్ కొన్నాం

November 13, 2025 5:44 PM

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన భూకబ్జా ఆరోపణలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఖండించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న పవన్ వ్యాఖ్యలను తిరస్కరించారు.

మిథున్ రెడ్డి ‘ఎక్స్’లో స్పందిస్తూ — “పవన్ గారు హెలికాప్టర్‌లో చూపించిన భూమి మా చట్టబద్ధమైన సొత్తు, 2000లోనే కొనుగోలు చేశాం” అన్నారు. ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు.

పవన్ చేసిన ఆరోపణలు, మిథున్ రెడ్డి ఇచ్చిన ప్రత్యుత్తరంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media