AMARAVATI :కాపు కార్పొరేషన్ డైరెక్టర్‌ : విన్నకోట శ్రీనివాసరావు

November 17, 2025 12:03 PM

మంగళగిరి 28వ వార్డు బాపనయ్య నగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఇటీవల కాపు కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన విన్నకోట శ్రీనివాసరావుకు నాయకులు ఘన సత్కారం నిర్వహించారు. పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఆయనను అభినందించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నియోజకవర్గంలో కాపు వర్గంతో పాటు ఇతర వర్గాల్లో పార్టీ బలపడేందుకు విన్నకోట చేసిన సేవలను గుర్తించి డైరెక్టర్ పదవి ఇవ్వడం హర్షణీయమన్నారు. ఆయన ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించి మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తురక వీరశేఖర్, తోట కరుణకుమార్, కోలా శ్రీనివాసరావు, దొడ్డాకుల శ్రీనివాసరావు, గాజుల క్రాంతికుమార్, పసుపులేటి సదాశివరావు, సుంకర ప్రసాద్, షేక్ రజియా, కోలా వెంకటనారాయణ, తోట శరత్ తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media