AP :పల్నాడు జిల్లా లో కలెక్టర్ ఆదేశాలకు ఆటంకం

November 20, 2025 10:16 AM

నరసరావుపేట పట్టణంలోని స్టేషన్ రోడ్డుపై నిర్మించిన అక్రమ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెను తొలగించాలని కలెక్టర్ కృతికా శుక్లా మునిసిపల్ అధికారులకు ఆదేశించినా, అమలులో ఇబ్బందులు తలెత్తాయి.

సోమవారం అక్కడికి వెళ్లిన మునిసిపల్ సిబ్బందిని భవన నిర్మాణదారులు అడ్డుకోవడంతో, అధికారులు వెనుదిరిగారు. ఓ ప్రజాప్రతినిధి జోక్యం కూడా తొలగింపు చర్యలను నిలిపేసింది.

టీపీ వో సాంబయ్య మాట్లాడుతూ—మునిసిపల్ అనుమతులు లేకుండా నిర్మించిన ఈ అక్రమ దిమ్మె వాహన రాకపోకలకు అడ్డుగా మారిందని, దీని తొలగింపు కోసం శాఖకు ఇప్పటికే సూచించామని వెల్లడించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media