AP :సాధారణ మహిళలతో ఆర్టీసీ బస్సులో నారా భువనేశ్వరి

November 21, 2025 2:19 PM

కుప్పంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా, శుక్రవారం మూడో రోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సాధారణ మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రభుత్వ ఉచిత బస్సు పథకాన్ని వినియోగిస్తూ భువనేశ్వరి బస్సులో ఎక్కి మహిళా ప్రయాణికులతో ఆప్యాయంగా మాట్లాడారు, వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఒక ప్రముఖ వ్యక్తి తమతోనే ప్రయాణించడం చూసి ప్రయాణికులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్శనం బస్సులో ఉన్న వారిలో హర్షం కలిగించడంతో పాటు స్థానికంగా విశేష దృష్టిని ఆకర్షించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media