Telengana :బతుకమ్మ కి ఒక్క చీర కూడా ఇవ్వలేని ప్రభుత్వం :మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

November 24, 2025 1:15 PM

సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ చేపడుతోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గత రెండు సంవత్సరాలుగా బతుకమ్మ సందర్భంగా ఒక్క చీర కూడా ఇవ్వని ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మాత్రమే చీరల పంపిణీ ప్రారంభించిందని విమర్శించారు.

మహిళలు చీరలను తీసుకున్నప్పటికీ, ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామని ప్రభుత్వం చెప్పిన హామీపై నాయకులను ప్రశ్నించాలని ఆయన మహిళలకు సూచించారు. అలాగే ఆసరా పెన్షన్‌ను ₹4,000కి పెంచుతామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని, బకాయిలుగా ప్రతీ మహిళకు ₹48,000 చెల్లించాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇది పూర్తిగా ఎన్నికల లాభం కోసం చేసే కార్యక్రమమని, మహిళలపై నిజమైన మక్కువ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media