ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామానికి చెందిన మారమ్ కుటుంబం సభ్యులు ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న విజయవాడ దుర్గ గుడికి దాదాపు 7.37 కిలోల వెండిను విరాళంగా అందించారు. వెండి విలువ సుమారు రూ. 12.82 లక్షలు.
కుటుంబంలోని ఆరుగురు సభ్యులు స్వయంగా వెండి వస్తువులు కొనుగోలు చేసి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈఓ) శ్రీ వి.కె. సీనా నాయక్ అందజేశారు.
విరాళ వివరాలు:
1)ఎమ్. శివ పార్వతి: వెండి ప్లేట్ – 1.258 కిలోలు
2) మారమ్ వెంకట రెడ్డి: వెండి గిన్నె – 1.096 కిలోలు
3) మారమ్ శైలజ: వెండి పళ్ళెం – 1.198 కిలోలు
4) గోపి రెడ్డి సుధీర్ రెడ్డి: వెండి పళ్ళెం – 1.279 కిలోలు
5) మారమ్ పిచ్చమ్మ: వెండి ప్లేట్ – 1.253 కిలోలు
6) మారమ్ వెంకట నాగ జ్యోతి: వెండి ప్లేట్ – 1.286 కిలోలు
ఈఓ శీనా నాయక్ దాతల నుంచి విరాళాన్ని స్వీకరించారు.
