TTD :పరకామణి కేసు దర్యాప్తు సీఐడీ విచారణకు వైవీ సుబ్బారెడ్డి హాజరు

November 28, 2025 4:24 PM

తిరుమల శ్రీవారి పరకామణి కేసు దర్యాప్తులో భాగంగా, టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఏపీ సీఐడీ పిలుపు మేరకు విచారణకు హాజరయ్యారు.

సీఐడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు తాను స్పష్టమైన వివరణలు ఇచ్చినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల పరకామణి విషయంలో జరిగిన ఘటన అత్యంత విచారకరమైనదని వ్యాఖ్యానించారు.

ఈ సంఘటన తన హయాంలో జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలోనే విచారణకు వచ్చానని తెలిపారు. చట్టపరమైన ప్రక్రియలో పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేసిన ఆయన, సమగ్ర విచారణ అనంతరం దోషులను గుర్తించి శిక్ష విధించే బాధ్యత కోర్టుదేనని పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media