దేశంలో ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును సేవాతీర్థ్ (Seva Theerth) గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనానికి ఈ నామకరణం జరిగింది.

కేంద్ర ప్రకటన:
కేంద్ర హోంశాఖ కార్యాలయం నవంబర్ 25న ఒక ప్రకటన జారీచేస్తూ, ప్రధాన మంత్రి కార్యాలయం పేరును ‘సేవాతీర్థ్’గా, రాజ్భవన్ పేరును లోక్భవన్ (Lok Bhavan) గా మారుస్తున్నట్లు తెలిపింది. ఆ మేరకు ఇవాళ పీఎంఓకు సేవాతీర్థ్గా నామకరణం చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

కేంద్రం నిర్ణయం మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ రాజ్భవన్ పేరును లోక్భవన్గా మార్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ రాజ్భవన్ పేరును లోక్భవన్గా మారుస్తూ త్వరలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
