జైపూర్ అటవీ ప్రాంత పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని కుందారం శిక్షణ అధికారి భగవంతరావు తెలిపారు.
ముదిగుంట, మిట్టపల్లి, వెంకట్రావుపల్లి, నర్వ గ్రామాల అటవీ ప్రాంతాల్లో పులి యొక్క పాదముద్రల ఆధారంగా దాని కదలికలను గుర్తించారు.పులి సంచారంతో అప్రమత్తంగా ఉండాలని పెగడపల్లి, గంగిపల్లి, మద్దులపల్లి, నర్సింగాపూర్, కుందారం తదితర గ్రామాల ప్రజలను భగవంతరావు హెచ్చరించారు.

ప్రజలు అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని, పశువులను అడవిలోకి పంపకుండా జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు.

