SABARIMALA యాత్రికులు 4 గురు మృతి విజయనగరం జిల్లాలో విషాదం

December 6, 2025 12:28 PM

శబరిమల దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న విజయనగరం జిల్లాకు చెందిన భక్తులకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం, రామేశ్వరం సమీపంలో నిన్న రాత్రి 2:15 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

మృతులు & బాధితులు:
ఈ ప్రమాదంలో దత్తిరాజేరు మండలం, గజపతినగరం మండలాలకు చెందిన మొత్తం ఐదుగురు ప్రయాణికులు చిక్కుకున్నారు.

1)వంగర రామకృష్ణ (51) – కోరపు కొత్తవలస, దత్తిరాజేరు

2)మార్పిన అప్పలనాయుడు (33) – కోరపు కొత్తవలస

3)మరాడ రాము (50) – కోరపు కొత్తవలస

4)బండారు చంద్ర రావు (35) – మరుపల్లి, గజపతినగరం

కోరపు కొత్తవలస గ్రామానికి చెందిన వ్యక్తి (వివరాలు సేకరిస్తున్నారు)శబరిమల యాత్ర ముగించుకుని వస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనతో దత్తిరాజేరు, గజపతినగరం మండలాల్లోని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media