AP :వ్యభిచారంతో పాటు చోరీ 10 లక్షల బంగారంతో పట్టుబడ్డ మహిళా ముఠా!

December 8, 2025 3:28 PM

వ్యభిచార వృత్తితో పాటు చోరీలు చేస్తున్న ఒక మహిళా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పాత గుంటూరుకు చెందిన అనిత అనే మహిళ, తన భర్తతో విడిపోయి, ఆయాగా పనిచేస్తూ ఆదాయం సరిపోక, వ్యభిచారం చేస్తూ జీవనం సాగిస్తోంది.

అనిత, కరిముల్లా, సాయి సంతోష్, గోపి, చందునాయక్‌లతో కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంది.వీరు అనితకు పరిచయస్తురాలైన మద్రాసు సరస్వతి ఇంట్లో దాదాపు పది లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించారు.

చోరీ జరిగిన నాలుగు నెలల తర్వాత పోలీసులు కేసును ఛేదించి, అనితతో పాటు మొత్తం ముఠాను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు ఈ ముఠాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media