Telengana EX MLCకి షాక్ కోటపల్లి సర్పంచ్ టికెట్ దక్కని పురాణం సునంద

December 9, 2025 6:59 PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కాంగ్రెస్ పార్టీలో భంగపాటు ఎదురైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఆయనకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన భార్యకు టికెట్ దక్కలేదు.

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన పురాణం సతీష్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీలో చేరారు.
కోటపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పురాణం సునంద (పురాణం సతీష్ భార్య) నామినేషన్ వేసినా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తుది జాబితాలో ఆమె పేరు లేదు. టికెట్‌ను అల్లూరి సంపత్ అనే వ్యక్తికి కేటాయించారు. చేసేదేమీ లేక, ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పురాణం సునంద తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు.

బీఆర్ఎస్‌లో ఉన్నత పదవులు అనుభవించిన పురాణం సతీష్‌కు కాంగ్రెస్ పార్టీలో ఇది గట్టి ఎదురుదెబ్బ అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక మంత్రి వివేక్ వెంకటస్వామి పాత్ర ఉన్నట్లు సమాచారం.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media