AP RTC BUSలో బంగారం చోరీ :నలుగురు మహిళల ముఠాను పట్టుకున్న ప్రయాణికులు

December 15, 2025 12:50 PM

ఆర్టీసీ బస్సుల్లో బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న నలుగురు మహిళల ముఠా గుంటూరు జిల్లా పొన్నూరు వద్ద పట్టుబడింది. పొన్నూరు రూరల్ పరిధిలో, ఆర్టీసీ బస్సులోప్రయాణికుల బంగారు ఆభరణాలు చోరీ చేయడానికి ఈ మహిళా ముఠా ప్రయత్నించింది.చోరీలకు పాల్పడుతున్న విధానాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై, ఆ నలుగురు మహిళలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పొన్నూరు రూరల్ పోలీసులు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న చోరీలకు అడ్డుకట్ట పడినట్లయింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media