AP నర్సీపట్నంలో రూ. 18.50 లక్షల విలువైన గంజాయి సీజ్

December 27, 2025 11:55 AM

గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నాతవరం మండలం శృంగవరం వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడినట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, నాతవరం ఎస్సై తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

నిందితుల వద్ద నుండి 75 కేజీల గంజాయి, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లు, 8 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 18.50 లక్షలు ఉంటుందని అంచనా.

ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని (ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు) అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ గంజాయి కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశా రాష్ట్రంలోని బలిమెల నుండి గిరిజనుల ద్వారా గంజాయి కొనుగోలు చేసి, దానిని తమిళనాడుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. అక్కడ కేజీ గంజాయిని రూ. 25 వేల చొప్పున ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో నాతవరం పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేసి నిందితులను పట్టుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media