రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు, బాపట్ల, కోనసీమ మరియు విశాఖపట్నం జిల్లాల్లో వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏలూరు జిల్లా నూజివీడు లో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్’ (IIPM) ఏర్పాటుకు 9.96 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని ఉద్యాన, పట్టు శాఖకు 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఉచితంగా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వేదాంత లిమిటెడ్కు లీజు: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఆన్షోర్ డ్రిల్లింగ్ కార్యకలాపాల కోసం వేదాంత లిమిటెడ్కు 9.88 ఎకరాల భూమిని 3 ఏళ్ల కాలానికి లీజుకు ఇచ్చింది. మార్కెట్ విలువలో 10% చొప్పున అంటే ఏడాదికి ₹15 లక్షల లీజు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ లో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరాకు ₹80 లక్షల చొప్పున మొత్తం ₹14.85 కోట్లకు ఈ కేటాయింపు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
బాపట్ల జిల్లా పశ్చిమ బాపట్లలో తెలుగుదేశం పార్టీ (TDP) జిల్లా కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం 2 ఎకరాల భూమిని కేటాయించింది. ఏడాదికి ₹1,000 లీజుపై 33 ఏళ్ల కాలానికి ఈ భూమిని బదిలీ చేస్తూ జి.ఓ. నంబర్ 534 విడుదల చేసింది.
