TG:కొండగట్టులో ఆంజనేయ క్షేత్రానికి DYCM పవన్ కళ్యాణ

January 3, 2026 12:08 PM

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు ఆంజనేయ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. టీటీడీ మంజూరు చేసిన ₹35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్ష విరమణ మండప నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం తెలంగాణ జనసేన శ్రేణులతో సమావేశం కానున్నారు.


మొత్తం ₹35.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సత్రం, దీక్ష విరమణ మండపానికి పవన్ కళ్యాణ్ భూమిపూజ చేస్తారు. పవన్ కళ్యాణ్ చొరవ, ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలతతో టీటీడీ బోర్డు ఈ నిధులను మంజూరు చేసింది. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్ష విరమించేలా భారీ మండపం, అలాగే 96 గదులతో కూడిన అత్యాధునిక సత్రాన్ని నిర్మించనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 వరకు ఆలయ దర్శనం, శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకలో టీటీడీ ఛైర్మన్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

శంకుస్థాపన అనంతరం కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్‌లో తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ సమావేశమవుతారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన అభ్యర్థులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media