కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జంట హత్యలు భూ తగాదాలే కారణం

January 5, 2026 5:28 PM

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో పాత కక్షలు మళ్లీ పడగవిప్పాయి. భూ తగాదాల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో బోయ పరమేష్, బోయ వెంకటేష్ ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా వీరి మధ్య భూమి విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. పాత కక్షలను మనసులో పెట్టుకున్న ప్రత్యర్థులు పక్కా పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతులు ఇద్దరూ గత ఏడాది (2025) ఫిబ్రవరి 24న జరిగిన ఒక హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్నట్లు సమాచారం. ఆ ఘటనకు ప్రతీకారంగానే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media