TG:కరకగూడెం పోలీస్ స్టేషన్ మారణకాండకి 29 ఏళ్లు

January 9, 2026 2:06 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత భీకరమైన నక్సలైట్ దాడుల్లో ఒకటిగా నిలిచిన కరకగూడెం పోలీస్ స్టేషన్ మారణకాండ జరిగి నేటికి సరిగ్గా 29 ఏళ్లు. 1997 జనవరి 9న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన నాటి సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.1997 జనవరి 9న అర్ధరాత్రి సమయంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు (నాటి పీపుల్స్ వార్) ఒక్కసారిగా కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. స్టేషన్ భవనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 16 మంది పోలీసులు వీరమరణం పొందారు.అమాయక పోలీసులను పొట్టనబెట్టుకోవడమే కాకుండా, స్టేషన్‌లో ఉన్న భారీ ఎత్తున ఆయుధాలను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. అడవి బిడ్డల రక్షణ కోసం పనిచేసే పోలీసులపై జరిగిన ఈ దాడి, నాటి ఏపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేసింది. నేటికి ఆ ప్రాంతంలో ఆ అమరవీరుల జ్ఞాపకాలు సజీవంగానే ఉన్నాయి.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media