TDP కేంద్ర కార్యాలయంలో వివేకానంద జయంతి వేడుకలు:C.M CBN

January 12, 2026 5:28 PM

స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఏపీటీఎస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, పార్టీ నేత పర్చూరి కృష్ణ మరియు ఇతర నాయకులు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

వివేకానందుడి బోధనలు నేటి యువతరానికి దిక్సూచి వంటివని, ఆయన చూపిన బాటలో యువత నడవాలని మన్నవ మోహనకృష్ణ పేర్కొన్నారు. “లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి” అనే నినాదంతో యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు, చికాగో వేదికగా హిందూ ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు వివేకానందుడని కొనియాడారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణ మరియు నైతిక విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media