దేశ రాజధానిలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమిటీల పాత్ర, పనితీరుపై ఈ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ పార్లమెంటేరియన్లతో కలిసి లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని పెంచడంలో పార్లమెంటరీ కమిటీలు కీలకమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవి వేదికలుగా నిలవాలని ఈ సందర్భంగా లోకేష్ అభిప్రాయపడ్డారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సభా నియమావళిని, కమిటీల పనితీరును అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్ కమిటీ వర్క్షాప్లో నారా లోకేష్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం!
