AP: లడ్డూపై అబద్ధాలు ఆడారు భీమిలిలో YSRCP నిరసన పూజలు

January 31, 2026 2:57 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు అవాస్తవాలని తేలిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ భీమిలిలో వైఎస్ఆర్సీపీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆధ్వర్యంలో స్థానిక ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసేలా కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, వారి మనసు మార్చాలని వైసీపీ శ్రేణులు స్వామివారిని వేడుకున్నాయి. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషప్రచారం చేశారని మండిపడ్డారు.సిబిఐ (CBI/SIT) దర్యాప్తులో లడ్డూ వివాదం కేవలం అబద్ధమని రుజువైందని, ఇప్పటికైనా కూటమి నేతలు తమ తప్పు తెలుసుకుని భక్తుల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media