యువతితో ప్రేమ వ్యవహారం ముదిరి ఒక నిండు ప్రాణం బలైన ఘటనలో చీరాల పోలీసులు నిందితులకు గట్టి గుణపాఠం చెప్పారు. జనవరి 27న జరిగిన కొండే త్రినాధ్ (19) దారుణ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారిని రోడ్డుపై నడిపిస్తూ (Public Parade) కోర్టుకు తీసుకెళ్లారు.

ప్రధాన నిందితుడు షేక్ గౌస్, త్రినాధ్ ప్రేమించిన యువతినే తానూ ప్రేమించాడు. ఈ క్రమంలో త్రినాధ్ను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు.ఫ్లైఓవర్ సమీపంలో త్రినాధ్ను అడ్డుకున్న గౌస్, దేవహర్ష, శీలం భగవంతుడు మొదట బీరు బాటిళ్లతో దాడి చేసి, ఆపై బండరాయితో తలపై మోది అతి కిరాతకంగా చంపేశారు.ప్రధాన నిందితులతో పాటు వారికి సహకరించిన చంద్ర ప్రకాష్, వల్లెపు వాసులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.DSP MD మొయిన్, సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించారు. నేరస్తుల్లో భయం కలిగించేందుకు నిందితులను రోడ్డుపై ప్రదర్శనగా తీసుకెళ్లారు. కేసును వేగంగా ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు.
