Kadapa నగర కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. Andhra Pradesh Anti-Corruption Bureau (ఏసీబీ) అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ తనిఖీలు చేపట్టారు.

టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులపై అక్రమాలు, లంచాల ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఏసీబీ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో అధికారులు రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తున్నారు.సోదాల సమయంలో కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకుండా గదుల తలుపులు మూసివేసి తనిఖీలు కొనసాగించారు. అనుమానాస్పద పత్రాలు, లావాదేవీలపై అధికారులు విచారణ చేస్తున్నారు. రికార్డుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

