Mangalagiriలోని AIIMS Mangalagiri హాస్టళ్లలో డయేరియా కలకలం రేపింది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, సిబ్బంది కలిపి సుమారు 25 మందికి డయేరియా లక్షణాలు కనిపించినట్లు సమాచారం.
గత మూడు రోజులుగా కొందరు విద్యార్థులు మరియు సిబ్బంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం డయేరియా లక్షణాలతో ఉన్న వారి కోసం ఎయిమ్స్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.ప్రస్తుతం 10 మంది విద్యార్థులు ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ, నీరు ఎక్కడ కలుషితమైందో తెలుసుకునేందుకు పరిశీలనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
