Hyderabadలోని అమరవీరుల స్థూపం వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు స్థూపానికి పాలాభిషేకం చేసి శుద్ధి కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమం తెలంగాణ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్ Mettu Sai Kumar ఆధ్వర్యంలో జరిగింది. బీఆర్ఎస్ నేతల రాకతో అమరవీరుల స్థూపం అపవిత్రమైందని, అందుకే పాలతో కడిగి శుద్ధి చేసినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
