AP :2014 పెద అవుటుపల్లి కాల్పుల కేసు : డీజీపీని కలిసిన బాధితులు

November 25, 2025 12:59 PM

2014 సెప్టెంబర్ 24న జరిగిన పెద అవుటుపల్లి కాల్పుల ఘటనలో మృతి చెందిన గంధం నాగేశ్వరరావు, పగిడి మారియ్య, మరొకరి కుటుంబ సభ్యులు నేటి రోజున ఏపీ డీజీపీని కలిసి న్యాయం కోరారు.

పినకడిమి గ్రామానికి చెందిన జ్యోతిష్కుడు తూర్పాటి నాగరాజు—2015లో హైదరాబాద్ సరుూర్‌నగర్‌లో తనపై జరిగిన హత్యాయత్నంపై—డీజీపీకి ఫిర్యాదు సమర్పించారు. 2014లో మూడు హత్యలు జరిగినా న్యాయం జరగలేదని, 2015 హత్యాయత్నంలో కొంతమంది పోలీసుల పాత్ర ఉందని ఆరోపించారు.

భూతం గోవింద్, భూతం శీను కుటుంబాలు లంచాలతో పోలీసులను ప్రభావితం చేస్తున్నాయని నిందించారు. అప్పటి విజయవాడ, ప్రస్తుతం ఏలూరు ఏఎస్పీ నక్క సూర్యచంద్రరావుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి ఆయన నుంచి ప్రాణహాని ఉందని, తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.

మూడు హత్య కేసుల్లో నిందితులకు సమన్లు వెళ్లకుండా ఏఎస్పీ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, న్యాయం చేయాలని డీజీపీని కుటుంబ సభ్యులు కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media