కోనసీమ తిరుమల’గా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ తెలుగు హాస్య నటుడు జోగి నాయుడు దర్శించుకున్నారు. సోమవారం ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు.
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ పండితులు జోగి నాయుడుకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. తనను కలిసిన అభిమానులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు.
