AP అడిగొప్పల జంట హత్యల కేసు ముగ్గురు నిందితుల అరెస్ట్

December 29, 2025 11:24 AM

పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పలలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దుర్గి పోలీసులు వెల్లడించారు.


ప్రధాన నిందితుడు (A1) యాగంటి నరేష్, పువ్వాడ రామలింగం (A2), ముత్యాల శివ (A3)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను పోలీసులు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ ఎదుట హాజరుపరిచారు.

కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను పోలీసులు భారీ భద్రత నడుమ గురజాల సబ్ జైలుకు తరలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media