AP:ఎండాకాలంలో దోమల నివారణ మీద శిక్షణ SatyaKumarYadav

February 12, 2026 3:45 PM

రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత, ‘నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్’ విభాగం ఆధ్వర్యంలో ఇన్సెక్ట్ కలెక్టర్లకు ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నారు. విజయవాడ శివారులోని జక్కంపూడి వంటి హాట్‌స్పాట్ ప్రాంతాలలో తెల్లవారుజామునే ఈ శిక్షణ ఇస్తున్నారు. టార్చ్ లైట్ మరియు ‘మస్కిటో కలెక్షన్ ట్యూబ్’ సాయంతో దోమలను సజీవంగా పట్టుకునే మెళకువలను సీనియర్లు వివరిస్తున్నారు.

పట్టుబడిన దోమ ఏ రకానికి చెందినది (అనాఫిలిస్, ఈడిస్ లేదా క్యూలెక్స్), అవి ఏ వ్యాధులను వ్యాప్తి చేస్తాయి అనే అంశాలను ప్రయోగశాలల్లో విశ్లేషిస్తారు. ఇన్సెక్ట్ కలెక్టర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా సదరు ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్, ఇండోర్ స్ప్రే వంటి చర్యలను జిల్లా యంత్రాంగం వేగవంతం చేస్తుంది. దోమల సాంద్రతను గుర్తించేందుకు ప్రభుత్వం ‘మస్కిటీర్’ (Musketeer) యాప్ మరియు డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్ వంటి అత్యాధునిక పద్ధతులను కూడా పరిశీలిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్, అదనపు సంచాలకులు సుబ్రహ్మణ్యేశ్వరి ఈ శిక్షణను పర్యవేక్షిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే లోతట్టు మరియు మారుమూల ప్రాంతాల్లో ఈ బృందాల పనితీరు కీలకంగా మారనుంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media