AP :హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా: ఓ మహిళ మృతి, 10 మందికి గాయాలు

December 2, 2025 10:53 AM

శ్రీనివాసపురం (ఆంధ్ర-కర్ణాటక బార్డర్): కడప నుంచి బెంగళూరుకు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడటంతో ఒక మహిళ మృతి చెందగా, 10 మందికి పైగా గాయాలయ్యాయి.

ఆంధ్ర-కర్ణాటక బార్డర్‌లోని శ్రీనివాసపురం తాలూకా, రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట్ వద్ద మంగళవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58) మృతి చెందారు.

గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగళూరుకు చెందినవారు ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాద ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media