AP:రాయవరంలో ‘మీ భూమి – మీ హక్కు’: CM చంద్రబాబు

January 9, 2026 5:22 PM

DR B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ యజమానులకు క్యూఆర్ కోడ్ (QR Code) తో కూడిన ఆధునిక పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల్లో జరిగిన అవకతవకలను సరిదిద్ది, రైతులకు శాశ్వత భూ హక్కు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు.

భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచామని, రైతుల భూమికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి దూరదృష్టితో చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల కోనసీమ రైతాంగానికి పెద్ద ఉపశమనం లభిస్తుందని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media