AP :మారేడుమిల్లి మండలంలో మరో భారీ ఎన్‌కౌంటర్ – 24 గంటల్లో రెండో ఘటన

November 19, 2025 1:58 PM

అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలంలో 24 గంటలు గడవక ముందే మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. 19.11.2025 ఉదయం తెల్లవారుజామున జీఎం వలస గ్రామం సమీప అటవీ ప్రాంతాల్లో పోలీసులు – మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడు మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల్లో గుర్తించినవారు:

మెట్టూరి జోగారావు @ టెక్ శంకర్

AOBSZCM & AOBSZC CCM (I/C)

సీతా @ జ్యోతి

DVCM, AOBSZC

అదనంగా AOBSZC కు చెందిన మరో ఐదుగురు ACMలు కూడా మృతులైనట్లు ప్రాథమిక సమాచారం.

పరిసర ప్రాంతంలో పోలీసులు కాంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అధికారుల నుండి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media