పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 133 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సబ్ స్టేషన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా పొగ ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మంటలు వేగంగా వ్యాపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ ఉపకరణాలు కావడంతో సాధారణ నీరు కాకుండా, ప్రత్యేకమైన ఫోమ్ వాటర్ (Foam Water) ఉపయోగించి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఇంజన్ సకాలంలో రావడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర సాంకేతిక లోపాలా అనే కోణంలో విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం కారణంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

