AP :మత్స్యకారుల సంక్షేమానికి నేను ఉన్న : మంత్రి డోలా

November 21, 2025 2:01 PM

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలోని చెన్నకేశవస్వామి చెరువులో శుక్రవారం చేపపిల్లలను వదిలిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి **డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడారు.

జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు, ట్యాంకులు, చెరువుల్లో 7 లక్షల చేపపిల్లలను వదలనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మంచి వర్షాలతో జలాశయాలు నిండినందున చేపపిల్లల పెంపకం మత్స్యకార సొసైటీలకు, గ్రామ పంచాయతీలకు ఆదాయం అందిస్తుందని చెప్పారు.

మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వేట నిషేధకాలంలో ₹20,000 భృతి, వేటకు వెళ్లే మత్స్యకారులకు బీమా సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media