దిట్వా తుఫాను శ్రీలంక తీరప్రాంతం మరియు నైరుతి బంగాళాఖాతం మీదుగా కదులుతున్న నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (IMD) తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాలకు ఎరుపు మరియు ORANGE హెచ్చరికలను జారీ చేసింది. చెన్నై RMC ప్రకారం, తుఫాను ఆదివారం ఉదయం ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి–దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో బంగాళాఖాతాన్ని చేరుకునే అవకాశం ఉంది. తుఫాను తమిళనాడు తీరానికి సమాంతరంగా కదులుతూ ఆదివారం సాయంత్రానికి లోతైన వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది.

శనివారం చెన్నైతో సహా 14 జిల్లాల్లో భారీ–అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం చెన్నై సహా పరిసర జిల్లాలకు ORANGE అలర్ట్, తిరువళ్లూరు మరియు రాణిపేటకు ఎరుపు అలర్ట్ జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో అప్రమత్తత
ఆంధ్రప్రదేశ్లో శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు IMD ORANGE హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం ఈ జిల్లాలతో పాటు అన్నమయ్య జిల్లాలో కూడా RED అలర్ట్ ప్రకటించి, అత్యంత భారీ వర్షాలు, స్థానిక వరదల ప్రమాదాన్ని హెచ్చరించింది. బంగాళాఖాతంలో అలల తీవ్రత పెరగడంతో మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు.
శ్రీలంకలో భారీ నష్టం—100కి పైగా మరణాలు

శ్రీలంకలో దిట్వా తుఫాను ప్రతాపం తీవ్రంగా ఉండడంతో 100 మందికి పైగా మరణించగా, సుమారు 2 లక్షల మంది ప్రభావితమయ్యారు. దేశంలోని 25 జిల్లాల్లో 20 జిల్లాలు తీవ్రమైన వరదలు, కొండచరియల పతనం వల్ల దెబ్బతిన్నాయి. తూర్పు తీర జిల్లాలు—అంపారా, బట్టికలోవా, ట్రింకోమలీ, అలాగే కాండీ, నువారా ఎలియా, మాటలే, బదుల్లా ప్రాంతాలు అధికంగా నష్టపోయాయి. అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయక ప్రజా సహాయ చర్యల్లో శాసనసభ్యులు పాల్గొనాలని కోరారు.
FUJIWARA effect :
ఫుజివారా ప్రభావం, రెండు సమీపంలోని తుఫానులు ఒక సాధారణ బిందువు చుట్టూ తిరిగే అరుదైన సంకర్షణ. 1921లో డాక్టర్ సకుహీ ఫుజివారా మొదట వివరించిన 2 తుఫానులు విలీనం అవుతుంది అప్పుడు అది చాల పెద్ద ప్రమాదం స్రుచ్చటిస్తుంది అని అంచనా
