AP POLICE :మీడియా ముసుగులో బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తే kabadar

November 14, 2025 11:10 AM

మీడియా పేరుతో బ్లాక్‌మెయిల్‌ చేయాలనే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. తుళ్ళూరు సీఐ మాతంగి శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి చానల్‌ రిపోర్టర్‌ సహకారంతో కుట్ర పన్నినట్లు విచారణలో బయటపడిందన్నారు. తన కార్ అద్దాలు తన వ్యక్తులతోనే పగలగొట్టించి రూ.5 వేల రూపాయలు చెల్లించినట్లు తేలిందని వెల్లడించారు.

ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మీడియా పేరు దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media