Sattenapalliలోని అంగన్వాడి కేంద్రాలను స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ Kantha Rao ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే సుగాలి కాలనీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించారు.చిన్నారులు, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
