AP సత్తెనపల్లిలో ‘ACID’ దాడి చేస్తానని MINOR విద్యార్థినికి బెదిరింపు

December 22, 2025 1:00 PM

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, యాసిడ్ దాడి చేస్తామని బెదిరించిన ఇద్దరు యువకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలిక (9వ తరగతి విద్యార్థిని)ను అదే ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావు (20), చిన్న కోటయ్య (21) కొంతకాలంగా వేధిస్తున్నారు. నిందితుడు కోటేశ్వరరావు సదరు బాలికను ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ, నిరాకరిస్తే యాసిడ్ పోసి చంపేస్తానని అత్యంత దారుణంగా బెదిరించాడు. భయాందోళనకు గురైన బాలిక తల్లిదండ్రులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులను ప్రస్తుతం జైలుకు తరలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media